మెదక్ మున్సిపాలిటీ : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన బృందావన్ కాలనీని మంగళవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరిలతో కలిసి సందర్శించారు. రాయిన్పల్లి కెనాల్ నుంచి కాలనీలోకి వస్తున్న వరద నీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆమె నీటి పారుదలశాఖ డీఈకి ఫోన్లో ఆదేశించారు.
అలాగే కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తూ డ్రైనేజీలను నిర్మించాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్కు సూచించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు కిశోర్, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మున్సిపల్ డీఈ మహేశ్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, సాధిక్, అంజాగౌడ్,
శ్రీనివాస్రెడ్డి, కిష్టయ్య తదితరులు ఉన్నారు.