సంగారెడ్డి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న మిథాలీ అగర్వాల్కు బెంగాల్లో నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్లో అవార్డు లభించింది. ఇటీవలే బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో 16వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ జరిగింది. పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కాంక్లేవ్లో కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లకు అవార్డులు ప్రదానం చేశారు.
సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న మిథాలీ అగర్వాల్కు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో అవార్డును ప్రదానం చేశారు. పశ్చిమబెంగాల్ వ్యవసాయశాఖ మంత్రి సువేందు ఛటోపాధ్యాయ చేతుల మీదుగా మిథాలీ అవార్డు అందుకున్నారు. పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్కు ఉత్తమ పోస్టర్ డిజైన్, మీడియా ఔట్రీచ్, ఉత్తమ చాప్టర్ కేటగిరీలో అవార్డులు వరించాయి.