నర్సాపూర్, సెప్టెంబర్1౩: ముఖ్యమంత్రి కేసీఆర్ను నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి సోమవారం ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజవర్గంలోని సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని, దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
సీఎం కేసీఆర్కు కలిసిన వారిలో బర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ ఆంజనేయులు, మాసాయిపేట్ సర్పంచ్ మధుసూదన్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రావూఫ్, టీఆర్ఎస్ నాయకులు దామోదర్రెడ్డి, రమేశ్ బాబు, రఘురామశర్మ తదితరులు ఉన్నారు.