అందోల్, జూన్ 2: పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని ఎర్రారం, నేరడిగుంట గ్రామాల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ కంది ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షయపాత్ర సంస్థ ద్వారా నిత్యం ఎంతోమంది పేదలకు కడుపు నిండుతున్నదన్నారు. లాక్డౌన్ సమయంలో సరై న ఉపాధి లేక పేద, మధ్య తరగతి వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఇలాంటి సమయంలో వారికి కడుపునిండా అన్నం పెట్టడం ఎంతో గొప్ప విషయమన్నారు. సంస్థ పీఆర్వో వీర్సంగప్ప మాట్లాడుతూ బుధవారం ఎర్రా రం, నేరడిగుంట గ్రామాల్లో 5 వందల మంది పేదలకు భోజనం అందిచామని తెలిపారు. అనంతరం సంస్థ ప్రతినిధులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు చందూలతమల్లప్ప, ప్రవీణ్రెడ్డి, ఎంపీటీసీ కృష్ణాగౌడ్, ఎంపీపీ బాలయ్య, వైస్ ఎంపీపీ మహేశ్వర్రెడ్డి, జోగిపేట ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్గుప్తా, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఉప సర్పంచ్ నాగప్ప పాల్గొన్నారు.