మెదక్, ఆగస్టు 3 : ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా మైనార్టీల సంక్షేమశాఖ జాతీయ నిర్మాణ అకాడమీ ద్వారా స్వయం ఉపాధి టైలరింగ్లో శిక్షణ పొందిన మైనార్టీ విద్యార్థులకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. న్యాక్ ద్వారా మహిళలకు మూడు నెలల శిక్షణ ఇచ్చామని, వారిలో హాజరు శాతం 80 ఉన్న 19 మంది మహిళలకు కుట్టుమిషన్, ధ్రువీకరణ పత్రాలు అందజేశామన్నారు. మిగతా వారికి కూడా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా రాబోయే కాలంలో కుట్టుమిషన్లు అందజేస్తామని తెలిపారు. దీంతో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని అన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి జగదీశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్లు జయరాజ్, కిశోర్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, శివరామకృష్ణ, శంకర్, మధుసూదన్, శ్రీధర్యాదవ్, కొర్వి రాములు, మధు, బొద్దుల కృష్ణ, మోచి కిషన్, ముజీబ్, ఉమర్, అమీర్ పాల్గొన్నారు.
బ్రాహ్మణ సంఘం భవనానికి సహకరిస్తా
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 3: జిల్లా బ్రాహ్మణ సంఘం భవనానికి సహకరిస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లమ్మ దేవాలయంలో బ్రాహ్మణ సంఘం సమావేశంలో పాల్గొని ఇటీవల జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కాకులవరపు వేదవ్యాసును, రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన దొర్బల శ్రీనివాస్ను శాలువా, పూలమాలలతో ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించే బ్రాహ్మణ సంఘానికి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం పద్మాదేవేందర్రెడ్డిని పూలమాలలు, శాలువాతో నూతన జిల్లా అధ్యక్షుడు వేదవ్యాసు ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో బ్రాహ్మ ణ సంఘం నాయకులు లింగమూర్తి, వైద్య శ్రీనివాస్శర్మ, రమేశ్బాబు, మిట్టపల్లి ప్రసాద్, వైద్య ప్రభాకర్, కాశీనాథ్, నర్సింగరావు, శ్రీనివాస్, శేఖర్, రఘు పాల్గొన్నారు.
రేణుకాంబకు ఎమ్మెల్యే పూజలు
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 3 : జిల్లా కేంద్రంలోని పసుపులేరు ఒడ్డున రేణుకాంబ మాతను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, కుటుంబ సభ్యుల పేరిట అర్చనలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పద్మాదేవేందర్రెడ్డిని సన్మానించారు. ఆషాఢ మాసం చివరి మంగళవారం కావడంతో రేణుకాంబను 50 కిలోల పసుపు కొమ్ములతో కనువిందు చేసేలా అలంకరించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, ఆర్కే శ్రీనివాస్, విశ్వం, కిశోర్, వసంత్రాజ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు లింగారెడ్డి, కొర్వి రాములు, మధుసూదన్రావు, దుర్గాప్రసాద్, ప్రవీణ్గౌడ్, ప్రసాద్, కాసాపురం మధు పాల్గొన్నారు.