ఝరాసంగం, మే 11 : కరోనా కట్టిడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ మాజీద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఝరా సంగ ంతోపాటు 33 గ్రామ పంచాయతీల్లో ఉన్న 36 గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల నుంచి గ్రామాల్లో సిబ్బంది జ్వర సర్వే నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మం డలం లో 36 గ్రామాల్లో 9,209 ఇండ్లు ఉన్నాయని, అందులో 8,351 ఇండ్లను సర్వే చేశామన్నారు. మిగిలిన 806 ఇండ్లను రెండు రోజుల్లో పూర్తి చేసి జిల్లా అధికారులకు నివేదిక అందజేమన్నారు. ఈ సర్వేలో 150 మంది సిబ్బంది పా ల్గొన్నారని తెలిపారు. సర్వేలో కొవిడ్ లక్షణాలు ఉన్న 215 మం దిని గుర్తిం చి వారికి మెకల్ కిట్లను అంద జేశామన్నారు. దవాఖానల్లో 407 మందిని గుర్తించి వారికి కూడా మెడికల్ కిట్లు అందజేశామని చెప్పారు. ప్రతిఒక్కరూ వైద్యుల సలహాలు తీసుకుని నిబంధనలు పాటించినట్లయితే కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చన్నారు. కార్యక్ర మంలో ఎంపీడీవో సుజాత, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, నాగరాజ్, ప్రభాకర్, అంగన్వాడీ టీచర్లు నాగమణి, కవిత, రాధికరాణి, అనిత, ఆశ కాకర్యకర్తలు పాల్గొన్నారు