న్యాల్కల్, జూన్ 22 : రైతులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమ మే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అన్నారు. మండలంలోని రేజింతల్, హద్నూర్, న్యాల్కల్, చాల్కి, హుస్సేనగర్, హుస్సేల్లి, మామిడ్గి గ్రామాల్లో రైతు వేదిక భవనాలతోపాటు న్యాల్కల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడారు.
రైతు బాగుంటేనే.. దేశం బాగుంటుందని గుర్తించి.. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారన్నా రు. ఇందులో భాగంగానే 24 గంటల కరెంట్, రైతుబంధు, రుణ మాఫీ, రైతుబీమా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. పంటల సాగు, ఆధునిక పద్ధతులు, మార్కెట్ విధానాలపై వ్యవసాయ సమస్యలను రైతులు సమిష్టిగా చర్చించుకొని పరిష్కరించుకునే అవకాశం రైతు వేదిక కల్పిస్తుందన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో రైతులు పంటలను సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. వర్షాధార పంటలు వేసే ఈ ప్రాంతానికి గోదావరి జలాలు వస్తాయని.. సంగమేశ్వర ఎత్తిపోతలతో ఇక్కడి భూములన్నీ సస్యశ్యామలమవుతాయన్నారు.
బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెట్టొద్దు
రైతుబంధు నగదు ఇవ్వకుండా రైతులను బ్యాంకు అధికారులు ఇబ్బందిపెట్టడడం సరికాదన్నారు. రైతుబంధు ప్రభుత్వమే పంట పెట్టుబడిగా ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ సా యాన్ని అడ్డుకోవద్దని సూచించారు. మండలంలోని హద్నూర్, కోత్తూర్(బీ), న్యాల్కల్, చాల్కి గ్రామాల్లోని సిండికెట్ (కెనరా), ఎస్బీఐ, ఏపీజీవీబీ బ్యాంకు అధికారుల తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. రైతుబంధు నగదు ఇవ్వని బ్యాంకు అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఏడీఏ జేడీ నర్సింగ్రావు, ఏడీఏ భిక్షపతి, ఎంపీడీవో జగదీశ్వర్, తహసీల్దార్ రాధాబాయి, ఏవో లావణ్య, జడ్పీటీసీ స్వప్నకుమారి, ఎంపీపీ అంజమ్మ, వైస్ ఎంపీపీ గౌసుద్దీన్, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రెహ్మన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్లు జగన్నాథ్రెడ్డి, సిద్ధిలింగయ్యస్వామి, ఎంపీటీసీలు దేశేట్టిపాటిల్, సంగమ్మ, సిద్ధన్న, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు కుత్బుద్దీన్, వీరామణి, శివశంకరయ్యస్వామి, కవితారెడ్డి, మారుతీయాదవ్, మల్లారెడ్డి, అమీర్, జ్ఞానేశ్వర్పాటిల్, చంద్ర న్న, సుధారాణి, నేతలు రవీందర్, చంద్రప్ప, పాండురంగారెడ్డి, రాజ్కుమార్, ప్రవీణ్కుమార్, భాస్కర్, శేఖర్రెడ్డి, భూమారెడ్డి, తుక్కారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మునీరుద్దీన్, బక్కారెడ్డి ఉన్నారు.