రామాయంపేట, జూన్ 14: పది రోజులుగా ఏర్పా టు చేసిన ప్రత్యేక వైద్యశిబిరంలో 3800 మందికి వ్యాక్సిన్ వేశామని మండల వైద్య ఆరోగ్యశాఖ విస్తరణ అధికారి రవీందర్, రామాయంపేట ఎంపీపీ నార్సింపే భిక్షపతి, పీహెచ్ఎన్ఎం సత్తమ్మ, డీఈ వో శిల్ప అన్నారు. సోమవారం రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక శిబిరాన్ని సం దర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యే క శిబిరంలో 13 రకాలకు చెందిన కార్మికులు, వ్యా పారులు, జర్నలిస్టులు, ఇతర రంగాలకు చెందిన వారికి ప్రత్యేకంగా శిబిరంలో వ్యాక్సిన్ అందజేసినట్లు తెలిపారు. పది రోజుల పాటు ఏర్పాటు చేసిన శి బిరం ఎంపీడీవో కార్యాలయంలో ముగిసిందన్నా రు.నేటి నుంచి రామాయంపేట సీహెచ్సీతో పాటు డీ. ధర్మారం పీహెచ్సీల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. రామాయంపేట, నిజాంపేట మండలాలకు చెందిన వారు డీ.ధర్మారం , రామాయంపేట సీహెచ్సీకి ఆధార్ కార్డుతో వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.
చేగుంటలో..
చేగుంట, జూన్ 14: చేగుంట, నార్సింగి మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రజాప్రతినిధులకు ఆటో, టాక్సీ డ్రైవర్లకు వాక్సిన్ మొదటి డోస్ వేశారు. చేగుంట నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సిన్ మొదటి డోస్ వేసినట్లు, మరో రెండు రోజులు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని డాక్టర్ వినయ్కుమార్, రాకేశ్ తెలిపారు.