మెదక్ జిల్లా తూప్రాన్లో చోటుచేసుకున్న విషాద ఘటన
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 16 : చేపలను పట్టేందుకు వెళ్లిన వ్యక్తి చెక్డ్యాంలో గల్లంతైన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి తూప్రాన్ హల్దీవాగులోకి విడుదల చేయడంతో మండలంలోని చెక్డ్యాంలు,హల్దీవాగు పరీవాహక ప్రాంతంలోని పరిసరాలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి.తూప్రాన్ పట్టణ పరిధిలోని రావెళ్లికి చెందిన దుకాండ్ల కిష్టయ్య (50) అదే గ్రామానికి చెందిన ఇద్దరి స్నేహితులతో కలిసి ఆబోతుపల్లి చెక్డ్యాం వద్దకు వెళ్లారు.చేపలు పడుతున్న క్రమంలో కిష్టయ్య కాలుజారి వాగులో పడ్డాడు. గమనించిన సమీపంలోని గ్రామస్తులు తాడుతో లాగేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.వాగులో కొట్టుకుపోతున్నాడన్న సమాచారం తెలుసుకున్న తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్,తాసీల్దార్ శ్రీదేవి,డిప్యూటీ తాసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ సంతోశ్ కుమార్,ఎస్సై సత్యనారాయణ చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ఈఘనటపై కుటుంబీకుల రోధనలు మన్నంటాయి. సమాచారం తెలుసుకున్న తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మోహన్తో పాటు పట్టణ కౌన్సిలర్లు,తూప్రాన్,గుండ్రెడ్డిపల్లి,వెంకటరత్నాపూర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.