మున్సిపల్కమిషనర్ శ్రీహరి
మెదక్ రూరల్ ,జూన్ 9: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. బుధవారం మెదక్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లో సూపర్స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పరిశీలించి డాక్టర్ మణికంఠను వివరాలు అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు , సూపర్స్ప్రెడర్ల అపోహలు పెట్టుకోకుండా వ్యాక్సిన్ వేసుకోవడానికి ముం దుకు రావాలని సూచించారు, ఈరోజు 300 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వారు తెలిపారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
రామాయంపేట పట్టణంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సి నేషన్ కొనసాగుతున్నదని ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్రాణి తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బుధవారం ఒక్కరోజు 306 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. పది రోజులు నిర్వహించే వ్యాక్సినేషన్కు పట్టణవాసులు ఒకరోజు ముందు మున్సిపల్ కార్యాలయంలో ఆన్లైన్లోనమోదు చేసుకుని మరుసటి రోజు ఎంపీడీవో కార్యాలయంలో టీకా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఉజ్వలరాణి, సునంద, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, పాకాల వెంకటేశ్వర్రావు, రా జు మున్సిపల్ సిబ్బంది కాలేరు ప్రసాద్, పవాత్ ప్రసాద్, బల్ల శ్రీనువాస్, నరేశ్, శంకర్లు ఉన్నారు.