మెదక్, జూన్ 8 : సమగ్ర ఎరువుల యా జమాన్యం, పచ్చిరొట్ట్ట ఎరువులు, జీవన ఎరువుల వాడకం – ప్రయోజనాలపై బుధ వారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించే చర్చా కార్యక్రమాన్ని టీశాట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ తాడె పు సోములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవగాహన చర్చా కార్యక్రమాన్ని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నిర్వహిస్తారని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ముఖ్యఅతిథిగా, చర్చలో వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు, శాస్త్రవేత్త సురేందర్ పాల్గొంటారని తెలిపారు. రైతుబంధు సమితి జిల్లా, మండల, గ్రామ కో ఆర్డినేటర్లు, సభ్యులు, రైతులు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు. సాగుకు సంబంధించిన సందేహాలను ఫోన్లో సంప్రదించి తెలుసుకోవచ్చని సూచించారు. 040-23540326, 23540726 ఫోన్ నెంబర్లతోపాటుటోల్ ఫ్రీ 18004254039 నంబర్ను సంప్రదించాలన్నారు. జిల్లాకేంద్రం లోని శ్రీసాయి కమ్యూనికేషన్ 59, 60 నెంబర్ల చానెళ్ల ద్వారా చర్చ ను ప్రసారం చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని జిల్లా రైతులు వీక్షించి, సాగుపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.