మెదక్, ఏప్రిల్ 10 : కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఆపత్కాలంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు కీలక నిర్ణ యం తీసుకున్నారు. నెలకు రూ.2వేలు, 25 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫలితంగా మెదక్ జిల్లాలో 1124 మందికి లబ్ధి చేకూరనుంది. దీంతో ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1124 మందికి లబ్ధి
మెదక్ జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవే ట్ పాఠశాలలు 110 ఉండగా, అందులో 1124 మంది బోధన, బోధనేతర సిబ్బందికి ప్రయోజనం కలగనుంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో మార్చిలో ప్రభుత్వం విద్యా సంస్థలను మూసి వేసింది. దీంతో అప్పటి నుంచి దాదాపు అనేక ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వారి వద్ద పని చేసే టీచర్లు, ఇతర సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదు. కొన్ని విద్యాసంస్థలు సగం వేతనాలు ఇవ్వగా, మరికొన్ని సంస్థలు భారీగా కోతలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు, సిబ్బంది రోడ్డున పడ్డారు.
ఇటీవల పాఠశాలలను ప్రభుత్వం తిరిగి ప్రారంభించడంతో ఆయా ప్రైవేట్ పాఠశాలల సిబ్బందిలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను ఈ నెల 15 వరకు సేకరించనున్నారు. అనంతరం అధికారులు తనిఖీ చేసి న అనంతరం 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అర్హు ల బ్యాంకు ఖాతాలో నగదును జమచేయనున్నా రు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రేషన్షాపు ద్వారా 25 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు.
రూ.2వేల ఆర్థిక సాయం.. 25 కిలోల బియ్యం
జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి నెలకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుర్తిం పు పొందిన ప్రైవేట్ పాఠశాలల టీచర్లు, సిబ్బంది బ్యాం క్ అకౌంట్లతో కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బం ది కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
కరోనా నేపథ్యంలో ప్రతి నెలా రూ.2వేలు, 25 కిలోల రేషన్ బియ్యం ఇస్తామనడం సంతోషకరం. ఏడాదిగా పాఠశాలలు మూ సివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. కుటుంబం గడవలేని పరిస్థితి దాపురించింది. ఒకవేళ పాఠశాలలకు వెళ్లినా సగం జీతమే ఇస్తున్నారు. తమ బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
కష్టాల్లో ఆదుకున్న ప్రభుత్వం
ప్రైవేట్ టీచర్ల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ప్రై వేట్ పాఠశాలల్లో పని చేసే టీచర్లు జీతాలు లేక వేరే పనులు చేస్తున్నారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్ టీచర్లు, సిబ్బందిని ఆదుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలా రూ.2వేలు ఇస్తే బాగుంటుందిబాగుంటుంది.