మెదక్, మే 30 : మెదక్ జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నది. పది గంటలు దాటితే పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టం చేస్తున్నారు. దుకాణాలు పది గంటల తర్వాత తెరిచి ఉంచకుండా యజమానులకు తెలుపుతూ బంద్ చేయిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట, చిన్నశంకరంపేట, హవేళిఘనపూర్, మెదక్ మండలంతో పాటు ఆయా మండలాల్లో లాక్డౌన్ విజయవంతమైంది. మెదక్ పట్టణంలో పట్టణ సీఐ వెంకట్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి మండలంలోని మంభోజిపల్లి, పాపన్నపేట, హవేళిఘనపూర్ మండలాల్లో లాక్డౌన్ను కఠినంగా వ్యవహరించేలా పోలీసు సిబ్బందికి సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరిని రోడ్లపైకి రానివ్వడంలేదు. అనవసరంగా ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదుతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు.
హవేళిఘనపూర్లో..
హవేళిఘనపూర్, మే 30: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రైనీ ఎస్సై వసంత అన్నారు. హవేళిఘనపూర్ పోలీస్స్టేషన్ వద్ద మెదక్- బోధన్ రహదారిపై వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ నవీన్, కృష్ణ, వెంకటేశం, సునంద ఉన్నారు.
మెదక్ రూరల్లో..
మెదక్ రూరల్ మే 30: మెదక్ మండలంలో లాక్డౌన్ కొనసాగుతున్నది ఉదయం 6గంటల నుం చి 10 వరకు ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుతో వినియోగదారులు అవసరమైన సామగ్రి కొనుగో లు చేశారు.మంబోజిపల్లి, మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద సిబ్బంది అనవసరంగా రోడ్డు పైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేసి జరిమానా విధించారు.