రామాయంపేట, మే 28: రామాయంపేట పట్టణంతో బాటు మండలవ్యాప్తంగా రెండో విడుత ఆరోగ్య సర్వే జోరు గా కొనసాగుతోంది. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని గొల్పర్తి గ్రామంలో రెండో విడుత సర్వే పనులు జోరుగా చైర్మన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. సర్వేలో భాగంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుని వారికి జ్వరం, కాళ్ల నొప్పులు, జలుబు, గొంతు నొప్పి, ఆయాసం తదితర వ్యాధులను రికార్డుల్లో నమోదు చేసుకుని వాటికి సంబంధించిన మాత్రల కిట్లను అందజేశారు. పల్లె ప్రాంతాలలో ఉన్న ప్రజలు కరోనా జాగ్రత్తలను పాటించాలన్నారు.ముఖ్యంగా యువత రోడ్డెక్క కుండా ఇంట్లోనే ఉండాలన్నారు. రోడ్డెక్కితే ప్రమాదాలు కాకుండా పోలీసులు పెనాల్టీలు వేస్తారన్నారు.
కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, బల్ల శ్రీనువాస్, పద్మ, శంకర్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు.