చేగుంట:మే27: రైతులకు ఇబ్బందులు ఉండవద్దని తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రకాష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన నార్సింగిలోని పలు రైస్మిల్లు లను గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రైస్మిల్లులకు ధాన్యం బస్తాల లోడుతో వచ్చిన లారీలను వెంట వెంటనే కాళీ చేయించాలని మిల్లర్లకు సూచించారు. రోహిణీకార్తెలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం ఉండ వద్దన్నారు. రైతుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో నార్సింగి తహసీల్దార్ సత్యనారాయణ, వీఆర్వో కిషన్, రైస్ మిల్లర్లు ఉన్నారు.