కరోనా విపత్తులో మెదక్ జిల్లా 108 సిబ్బంది బాధితులకు భరోసానిస్తున్నారు. సాధారణ కేసులతో పాటు కరోనా బాధితులను సకాలంలో వైద్యం అందేలా చూస్తున్నారు. ఐదు నెలలుగా 4,423 మంది రోగులకు సేవలు అందించగా, 416 మంది కరోనా బాధితులను మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ దవాఖానలకు తరలించారు. 108 సిబ్బంది వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను నిలుపుతున్నారు. కరోనా మొదటి దశలో కూడా కరోనా రోగులను తరలించి వారి ప్రాణాలు కాపాడారు.
మెదక్, మే 26 : ఆపద సమయంలో కరోనా బాధితులకు 108 సిబ్బంది భరోసానిస్తున్నారు. వైపు కరోనా బాధితులు.. మరో వైపు ఇతర రోగులను సకాలంలో దవాఖానలకు తరలిసూ విస్తృత సేవలు అందిస్తున్నాయి. ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానలకు తరలిస్తూ వారి ప్రాణాలు నిలుపుతున్నాయి. లాక్డౌన్ సమయంలో కరోనా బాధితులకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే.. అదే సమయంలో గర్భిణులను దవాఖానలకు తరలించి సుఖ ప్రసవాలు జరిగేలా చూస్తున్నాయి.
మెదక్ జిల్లాలో 11 అంబులెన్స్లు..
మెదక్ జిల్లాలో 108 అంబులెన్స్లు 11 అందుబాటులో ఉన్నాయి. మెదక్లో ఒకటి, హవేళీఘణాపూర్ ఒకటి, రామాయంపేట ఒకటి, తూప్రాన్లో ఒకటి, నర్సాపూర్లో ఒకటి, కౌడిపల్లిలో ఒకటి, పాపన్నపేటలో ఒకటి, టేక్మాల్లో ఒకటి, అల్లాదుర్గంలో ఒకటి, పెద్దశంకరంపేటలో ఒకటి ఉన్నాయి. జిల్లాలో కరోనా వైరస్ విజృంభించడంతో కేసులు పెరుగుతున్నాయి. 108 అంబులెన్స్లు విరామం లేకుండా పనిచేస్తున్నాయి. ఐదు నెలలుగా 4,423 మంది రోగులకు సేవలు అందించగా, 416 మంది కరోనా బాధితులను మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ దవాఖానలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. 108 సిబ్బంది వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారు.
పీపీఈ కిట్ల రక్షణతో…
ప్రభుత్వం అందజేసిన పీపీఈ కిట్ల రక్షణతో కరోనా రోగులకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. అవసరమైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సీపీఆర్ ఇస్తున్నారు. దగ్గరలో ఉన్న దవాఖానలకు ఫోన్ చేసి పడకల ఖాళీ పరిస్థితిని తెలుసుకొని రోగులను తరలించడంలో విశేష సేవలు అందిస్తున్నారు. ఏ సమయంలోనైనా 108కు ఫోన్ నిమిషాల్లోనే రోగి వద్దకు వాహనం చేరుకుంటుంది. క్షతగాత్రులను వెం టనే దవాఖానకు తరలించడమే కాకుండా అవసరమైతే ప్రథమ చికిత్స కూడా సిబ్బంది చేస్తున్నారు. ఒక్కోసారి కండ్లముందే కరోనా రోగులతో పాటు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు చనిపోయినా ఆత్మైస్థెర్యం కోల్పోకుండా సేవలందిస్తున్నారు.
అంబులెన్సులను శానిటైజ్ చేస్తూ…
మెదక్ కలెక్టర్ హరీశ్ ఆదేశాల మేరకు కరోనా రోగిని దవాఖానకు తీసుకెళ్లిన అనంతరం అం బులెన్స్ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన రోగులకు ధైర్యం చెబుతూ అంబులెన్స్లోనే ఆక్సిజన్ అందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. గ్రామీణ ప్రాం తాల్లో గర్భిణులను తరలించే సమయంలో సిబ్బంది వాహనంలోనే సుఖ ప్రసవం చేసి తల్లీబిడ్డలను కాపాడిన సంఘటనలు చాలా ఉన్నాయి.
జిల్లాలో ఐదు నెలల్లో కేసులు ఇలా..
నెల కరోనా ఇతరులు రోగులు
జనవరి 2021 03 1083
ఫిబ్రవరి – 998
మార్చి 04 1162
ఏప్రిల్ 199 806
మే 210 374
మా సిబ్బంది అద్భుతమైన సేవలందిస్తున్నారు..
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. కరోనా రెండో దశ ఉధృతి కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మా సిబ్బంది అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. కరోనా రోగులతోపాటు ఇతర రోగులకు కూడా సేవలు చేస్తున్నారు.
భాస్కర్, 108 జిల్లా అధికారి
రోగులను త్వరగా దవాఖానకు తీసుకెళ్తున్నాం..
సమయాన్ని వృ థా చేయకుండా సా ధ్యమైనంత త్వరగా రోగులను దవాఖానలకు తీసుకెళ్లెలా చూ స్తున్నాం. గర్భిణులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా సేవలందిస్తున్నాం. ప్రస్తుతం కరోనా సమయంలో సెలవులు కూడా తీసుకోవడం లేదు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ సేవలందిస్తున్నాం.
-జాకబ్, ఈఎంటీ