పాపన్నపేట, 25 మే : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయ హుండీ ఆదాయం 11.56 లక్షలు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం గోకుల్షెడ్లో హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ సిబ్బంది, అర్చకులు హుండీ లెక్కింపు చేపట్టగా.. దేవాదాయ ధర్మాదాయశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. ప్రభుత్వం కరోనా కట్టడి చేయడానికి లాక్డౌన్తో పాటు ఈవోకు కరోనా సోకడం మూలంగా కొన్ని రోజులుగా ఆలయం మూసి వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆలయం మూసివేసిన రోజులు పోగా, 45 రోజుల హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. బంగారం, వెండి వస్తువులు మినహా నగదు రూపంలో 11లక్షల 56వేల 323 రూపాయల ఆదాయం ఆలయానికి సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రతాప్రెడ్డి, రవి, విఠల్, యాదగిరి, అర్చకులు శంకర్శర్మ, నరసింహాచారి, మురళీశర్మ, రాముశర్మ, రాజశేఖర్శర్మ పాల్గొన్నారు.