కరోనా వ్యాప్తి నియంత్రణకు చేపట్టిన వ్యాక్సినేషన్ మెదక్ జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం వంద శాతం లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా టీకాలు వేశారు. 23 రోజుల్లోనే 2లక్షల 29వేల మందికి టీకాలు ఇచ్చారు. వీరిలో మొదటి డోస్ 1,87,444 మంది తీసుకోగా, రెండో డోస్ 41,710 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట దవాఖానలతో పాటు 20 పీహెచ్సీ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది.
కరోనాను అరికట్టేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జోరుగా కొనసాగుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో గత జనవరి 16న రాష్ట్ర ప్రభుత్వం టీకా పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా టీకాలు వేశారు. దీంతో త్వరితగతిన లక్ష్యం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదిలా ఉండగా గత నెల16వ తేదీ నుంచి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. 23 రోజుల్లోనే 2లక్షల 29వేల మందికి టీకాలు వేశారు. వీరిలో 1,87,444 మంది మొదటి డోస్ తీసుకోగా, 41,710 మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో..
జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోన్నది. కలెక్టర్ హరీశ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సిన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 5లక్షల 9వేల 658 మందికి టీకా వేయగా, అందులో 3,89,338 మందికి మొదటి డోస్ తీసుకోగా, 1,16,498 మంది రెండో డోస్ టీకా తీసుకున్నారు. వీరిలో 18నుంచి 44 ఏండ్ల వయస్సు వారు 1,83,313 మంది టీకా తీసుకోగా, 45 నుంచి 59 ఏండ్ల వయస్సు వారు 1,99,869 మంది, 60 ఏండ్ల వయస్సు వారు 1,11,752 మంది టీకా వేసుకున్నారు.
20 పీహెచ్సీల్లో..
జిల్లాలో జిల్లా కేంద్ర దవాఖానతో పాటు నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి, తూప్రాన్లో సీహెచ్సీ సెంటర్, రామాయంపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్తో పాటు 20 పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోన్నది. కరోనా నివారణ టీకా ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికార యంత్రాంగం 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మొదటి, రెండోడోస్ పూర్తి చేయడానికి మెగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా 20 పీహెచ్సీల్లో టీకా శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు రెండు డోస్లు వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్య శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది.
వంద శాతమే లక్ష్యం..
మెదక్ జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కింద వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోన్నది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. వందశాతం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా టీకాలు వేశాం. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 11: జిల్లాలో కొవిడ్ -19 వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై సోమవారం వైద్యాధికారులు, అనుబంధ శాఖల అధికారులు, ముసిపల్ చైర్మన్లు, కమిషనర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీపీలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరికీ కొవిడ్ టీకా విధిగా వేయాలన్నారు. జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సురక్షితగా ఉండాలంటే వ్యాక్సిన్ వేసుకోవడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ఆయా ప్రజాప్రతినిధులపై ఉన్నదన్నారు. సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, సంబంధిత అధికారులు ప్రతివార్డు, గ్రామం, మున్సిపాలిటీల్లో వారంలోగా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వ్యాక్సిన్కు కొరత లేదని, అవసరమైన మేరకు అందుబాటులో ఉందన్నారు. వ్యాక్సినేషన్లో వెనుకంజలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీల పరిధిలో సుమారు 92శాతం వ్యాక్సినేషన్ ఇవ్వడం పూర్తయిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కొంతమేర వెనుకబడి ఉన్నదన్నారు. గ్రామీణ ప్రాంతంలో 100 శాతం వ్యాక్సిన్ పూర్తయ్యేలా చూడాలని డీఆర్డీవోలకు సూచించారు. ముఖ్యంగా దసరా, బతుకమ్మ పండుగకు వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు తమ ఇండ్లకు చేరుకుంటారని, ప్రత్యేక డ్రైవ్గా అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతానికి పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి, వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చేవిధంగా అవగాహన కల్పించాలని డీఆర్డీవోకు సూచించారు. టెలీకాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షీ షా, డీఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, జడ్పీ సీఈవో ఎల్లయ్య ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీహెచ్సీ 16.9.2021 నుంచి 09.10.2021 వరకు
అల్లాదుర్గం 4830
చేగుంట 11964
డి.ధర్మారం 20246
గడిపెద్దాపూర్ 2204
కౌడిపల్లి 18580
కొల్చారం 5763
మెదక్ అర్బన్
పీహెచ్సీ 11845
నార్సింగి 8320
పాపన్నపేట 8869
పొడ్చన్పల్లి 6539
రంగంపేట 5214
రెడ్డిపల్లి 16817
రేగోడ్ 5738
సర్ధన 17395
పెద్దశంకరంపేట 9078
చిన్నశంకరంపేట 12128
శివ్వంపేట 14884
టేక్మాల్ 9778
తూప్రాన్ 24451
వెల్దుర్తి 14511