కొల్చారం, జూన్ 21: రంగనాయకస్వామి దేవాలయ నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రంగనాయకస్వామి దేవాలయంలో సోమవారం నిర్వహించిన యాగానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. రంగనాయకస్వామి ఆశీస్సులతో రంగంపేటను కొత్త మండలంగా ఏర్పాటు చేయిస్తా , రంగనాయకస్వామి దేవాలయాన్ని పునరుద్ధ్దరణకు , పూజారికి దూపదీప నైవేధ్యం పథకం ద్వారా జీతం అందజేయడానికి ప్రతిపాదనలు పంపుతానని ఎమ్మెల్యే తెలిపారు. లోక కల్యాణార్థం రంగంపేట మదనానంద ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి పర్యవేక్షణలో యజ్ఞం నిర్వహిసున్నారు. పూజారిగా నియామకమైన నామాళ్వార్ కరుణాకరన్ పంతులుకు ఎమ్మెల్యే మదన్రెడ్డి పట్టాభిషేకం నిర్వహించారు.
రాష్ట్ర మహిళాకమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి ప్రత్యేక పూజలు
రాష్ట్ర మహిళా కమిషన్ చైరపర్సన్ సునీతారెడ్డి రంగనాయకస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ అశోక్గౌడ్, మండల పరిషత్ అధ్యక్షురాలు మంజుల కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోశ్, సర్పంచ్ బండి సుజాత రమేశ్, ఎంపీటీసీ మాదవి రాజాగౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు దుర్గేశ్, చంద్రశేఖర్రెడ్డి, కోనాపూర్ సంతోశ్రావు పాల్గొన్నారు.
నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
ఆడపడుచులకు కల్యాణలక్ష్మి వరంగా మారిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో 40 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అనంతరం గూడూరు గ్రామంలో సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఫుడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ మహేశ్గుప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, తహసీల్దార్ భానుప్రకాశ్, ఎంపీడీవో నవీన్కుమార్, సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, ఫణిశశాంక్, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.