నిజాంపేట, మే 24: ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది చేపట్టిన జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని నందిగామ సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ సురేశ్ కోరారు. సోమవారం వారు వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, జలుబు, దగ్గు తదితర ఇబ్బందులతో బాధపడుతున్న వారి పేర్లను నమోదు చేసుకొని, అవసరమున్న వారికి కరోనా కిట్లను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహ్మద్ ఆరీఫ్ హుస్సేన్, ఆశవర్కర్ గౌరి, అంగన్వాడీ కార్యకర్త రామలక్ష్మి, గ్రామస్తులు రాజ్గోపాల్ ఉన్నారు.
రామాయంపేట…
రామాయంపేట, మే 24: రామాయంపేట మండల వ్యాప్తం గా రెండో విడత ఆరోగ్య సర్వే జోరుగా కొనసాగుతున్నది. పట్టణంతో పాటు మండల పరిధిలోని కాట్రియాల, కోనాపూర్, డీ.ధర్మారం, అక్కన్నపేట గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతున్నాయి. సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటున్నారు. జ్వరం, కాళ్ల నొప్పులు, జలుబు, గొంతు నొప్పి, ఆయాసం తదితర వ్యాధులను రికార్డుల్లో రాసుకుని వాటికి సంబంధించిన మాత్రల కిట్లను అందజేస్తున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉ న్నారు.
బాధితులు ఆందోళన చెందవద్దు
తూప్రాన్ రూరల్, మే 24 : కొవిడ్ లక్షణాలున్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, వైద్య సిబ్బంది సూచనల మేరకు మందులను క్రమం తప్పకుండా వాడాలని తూప్రాన్ రెండో వార్డు కౌన్సిలర్ మామిడి వెంకటేశ్ సూచించారు. వార్డులోని తాతపాపన్పల్లిలో స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్న కుటుంబాలను ఆయన పరామర్శించారు.
లక్షణాలు ఉంటే చెప్పాలి..
కొల్చారం, మే 24: జ్వరంతో పాటు కొవిడ్ లక్షణా ఉంటే చెప్పాలని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వరిగుంతం సబ్సెంటర్ ఏఎన్ఎం ప్రవీ ణ సూచించారు. మండల పరిధిలోని వరిగుంతంలో ఆశ వర్కర్తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. లక్షణా లు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫోన్లో సమాచారం ఇచ్చి పరీక్ష కోసం పంపించారు. వరిగుంతంలో మూడుటీంలతో సర్వే చేస్తున్నామని ఏఎన్ఎం తెలిపారు. ఈ సర్వేలో అంగన్వాడీ సి బ్బంది, ఆశవర్కర్లు చంద్రకళ, పాల్గొన్నారు.
కొవిడ్ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి
నర్సాపూర్, మే 24 : ఎవరికైనా కొ విడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని పంచాయతీ కార్యదర్శి శ్వేత సూచించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండోసారి సర్వే చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ భాగ్య, అంగన్వాడీ టీచర్ శోభ పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంటింటి సర్వే..
వెల్దుర్తి ,మే 24 : ఇంటింటి సర్వే వెల్దుర్తి మండల వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. వెల్దుర్తిలో అంగన్వాడీ టీచర్ మ ం గమ్మ, ఏఎన్ఎం పద్మ, ఆశ మాధవి పట్టణంలో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. జ్వరం, దగ్గు, జలుబుతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి, వారికి ఉచితంగా మందులను అందజేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి కరోనా కిట్లను పంపిణీ చేశారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు, కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే తమకు సమాచా రం అందించాలన్నారు.