మనోహరాబాద్, జూలై 20 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ స్థానంలోఉందని జడ్పీచైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలానికి చెందిన 52 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళలు, ఆడపిల్లల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు వివిధ రంగాల్లో రాణించే విధంగా వారికి సీఎం కేసీఆర్ ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. పల్లె ప్రగతిలో మహిళల పాత్ర ఎంతో అవసరమని, ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచి పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్య త పెద్దలపై ఉందన్నారు. తెలంగాణ లో జరుగతున్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.కార్యక్రమంతో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీ వో శ్యాంప్రకాశ్, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్, ఎంపీపీ నవనీతరవి, వైస్ ఎంపీ పీ విఠల్రెడ్డి, ఎంపీటీసీ లతవెంకట్గౌడ్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్ మహిపాల్రెడ్డి, ఉపాధ్యక్షుడు మ ల్లేశ్, ఉపసర్పంచ్ల ఫోరం జిల్లాఅధ్యక్షుడు రేణుకుమార్,లబ్ధిదారులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ల సం ఘం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డిలను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశాడు. జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి సన్మానించారు. ఉపసర్పంచ్లకు తగిన గౌరవం ఇ చ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గ్రామాభివృద్ధిలో ఉప సర్పంచ్లు కీలక పాత్ర పోషించి పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేశ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వర్లు, నాయకులు చంద్రశేఖర్ ము దిరాజ్, రమేశ్, వెంకట్గౌడ్ పాల్గొన్నారు.