మెదక్, సెప్టెంబర్ 19 : గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో మరికొన్ని గంటల్లో నిమజ్జన వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా గణనాథులకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం వేకువజామున వరకు శోభాయాత్ర కన్నుల పండువగా సాగనుంది.సంబంధించిన ఏర్పాట్లు మున్సిపల్, పోలీసు, రెవెన్యూ శాఖ, ఫైర్, మత్య్సశాఖలు పూర్తి చేశాయి. పారిశుధ్యం, క్రేన్ల నిర్వహణ, నిమజ్జన పనులు మున్సిపల్ శాఖ పర్యవేక్షిస్తుండగా, పోలీసు శాఖ బందోబస్తు, ఇతర ఏర్పాట్లు రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తోంది.
అడుగడుగునా పోలీసు నిఘా..
గణేశ్ నిమజ్జన సందర్భంగా పోలీసు నిఘా ఉంచారు. ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో 600 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. స్పెషల్ పార్టీ, ఆర్మీ ఫోర్స్ సిబ్బంది కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నిమజ్జనం సందర్భంగా ఎలాం టి సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం రో జు జిల్లా వ్యాప్తంగా 450 గణేశ్ విగ్రహాల ను నిమజ్జనం చేయగా, సోమవారం 750 గణనాథులను నిమజ్జనం చేయనున్నారు.
భారీగా ఏర్పాట్లు…
భారీ విగ్రహాలను మెదక్ మండలంలోని కోంటూరు చెరువులోనే నిమజ్జనం చేస్తున్నారు. చెరువు కట్ట వద్ద హైమాస్ట్ లైట్లతో విద్యుత్ దీపాలంకరణ, భారీకేడ్లు ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట చెరువుల్లో భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను ఉంచారు. మున్సిపల్ ఆధ్వర్యంలో మెదక్ రాందాస్ చౌరస్తాతో పాటు ఆయా వార్డుల్లో మంచినీటి వసతులు ఏర్పాటు చేశారు. నిమజ్జన పాయింట్లలో వైద్య శాఖ తరపున అంబులెన్స్, వైద్యులను అందుబాటులో ఉంచారు. వేడుకలను జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, ఎస్పీ చందనదీప్తి, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 1: గణేశ్ నిమజ్జనోత్సవానికి జిల్లా కేంద్రంలోని గోసముద్రం, బంగ్లా చెరువు, ఎంఎన్ కెనాల్తో పాటు కొంటూర్ చెరువులో గణేశ్ నిమజ్జనోత్సవ ఏర్పా ట్లను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ యేడాది కరో నా తగ్గుముఖం పట్టడంతో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు నెలకొల్పారని చైర్మన్ తెలిపారు. కొంటూర్ చెరువులో రెండు క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జ నానికి వెళ్లే రోడ్లను మున్సిపల్ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. చైర్మన్ వెంట మున్సిపల్ డీఈ మహేశ్, ఏఈ సిద్ధేశ్వరీ, మున్సిప ల్ సిబ్బంది చంద్రమోహన్, టెక్నికల్ ఇన్స్పెక్టర్ సలీం ఉన్నారు.
నిమజ్జనాలు ప్రశాతంగా నిర్వహించాలి
పెద్దశంకరంపేట, సెప్టెంబర్ 19: గణేశ్ నిమజ్జనాలు శాంతియుత వాతావారణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. చెరువుల వద్ద గణేశ్ నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. లైటింగ్ ఏర్పాటు చేయాలని సర్పంచ్లకు సూచించారు. సమావేశంలో తహసీల్దార్ చరణ్, ఎస్సై నరేందర్, ఎంపీవో రియాజొద్దీన్, ఎంపీటీసీ వీణా సుభాశ్గౌడ్, యాకూబ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాములు, సర్పంచ్ అశోక్, రమేశ్, తదితరులున్నారు.
ప్రశాంతంగా జరుపుకోవాలి…
వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతం గా జరుపుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కోరారు.మెదక్ మండలంలోని కొంటూరు , మల్లం చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. మెదక్లో 200 లకు పైగా విగ్రహాల ఏర్పాటు చేశారన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని పలు వినాయక మండపాళ్ల వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళవారం జరిగే శోభాయాత్రలో ఆమె పాల్గొంటారు.
-ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
నిమజ్జనానికి భారీ బందోబస్తు..
గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. శాంతియుత వాతావరణంలో వేడుకలుజరుపుకోవాలి. అల్లర్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. నిమజ్జనం జరిగే ప్రాం తాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రత్యేకంగా శోభాయాత్రకు వెళ్లే దారి లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.