వర్గల్, ఏప్రిల్ 18: ఇలలో కలగనని.. మహోజ్వల ఘట్టం గోదావరి నీళ్లను పల్లెపల్లెకూ దరిచేర్చడం.. ప్రభువులు, ప్రభుత్వాలు చేయని సాహసం మారుమూల ప్రాంతాన్ని తడపడం సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమైంది. దేశచరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు ఏప్రిల్ 6 వెరసి గోదావరి జలాలు వర్గల్ మండలంలోని నాలుగు చెరువులను దాటుతూ పశ్చిమ దిశగా ప్రయాణం మొదలుపెట్టి ఆదివారం నాటికి 13 రోజులను పూర్తి చేసుకున్నాయి. పుష్కర గోదావరి జలసవ్వడులు.. పుష్కరదినాలుగా ప్రహిస్తుండటంతో వర్గల్ మండలంలోని రైతులు, ప్రజలు సబ్బండ వర్గాల సంతోషాలకు అవధులు లేకుండాపోతున్నాయి. అవుసులోనిపల్లి వద్ద నిర్మించిన సంగారెడ్డి కెనాల్ అప్టెక్ వద్ద నుంచి చౌదర్పల్లి బంధం చెరువు, వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్పేటఖాన్ చెరువు వరకు 6.41కిలో మీటర్ల పొడవునా 95 ఎంఎస్ఎఫ్టీ సామర్థ్యం చెరువులను దాటుతూ 923 ఎకరాల ఆయకట్టు ప్రాంతాల రైతులకు బతుకు భరోసానిస్తూ హల్దీ వాగును జీవనదిలా మారుస్తూ నిత్యం ప్రయాణం కొనసాగిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
సిద్దిపేట మున్సిపాలిటీకి 576 నామినేషన్లు దాఖలు