సంగారెడ్డి, ఏప్రిల్ 18: కరోనా సెకెండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలు, బస్టాండ్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఆదివా రం మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశాలతో శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ విఠల్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత, కొత్త బస్టాండ్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశామని కమిషనర్ తెలిపారు. అధికంగా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను గుర్తించి ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నామని శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్పారు. ప్రజలు అధైర్యపడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం మరిచిపోవద్దని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
పూజాహెగ్డే ఫ్యామిలీ పార్టీ..వీడియో వైరల్
గ్రేటర్ వరంగల్.. వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలు