నిజాంపేట, మే 17 :ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి అన్నారు. సోమవారం తహసీల్దార్ జైరాములు, మండల ఏవో సతీశ్తో కలిసి నిజాంపేట, నందిగామ గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు నిజాంపేటలోని ఐకేపీ గోదాం, రైతువేదికను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఏ సెంటర్లలోని లారీలు ఆ సెంటర్లలోకే వెళ్లేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైస్మిల్లు యజమానులతో మాట్లాడి ఐకేపీ గోదాం, రైతువేదికలో ధాన్యాన్ని నిల్వచేసుకొనే విధంగా తగిన ఏర్పాటు చేశామన్నారు. ఆమె వెంట నిజాంపేట పీఏసీఎస్ బాపురెడ్డి, పీఏసీఎస్, ఐకేసీ సిబ్బంది, రైతులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని ఎండబెట్టుకుని తీసుకురావాలని జిల్లా వ్యవసాయ అధికారి (మండల ప్రత్యేక అధికారి) పరశురాంనాయక్ సూచించారు. సోమవారం ఆయన టేక్మాల్తోపాటు పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. తేమ శాతం ఎక్కువ లేకుండా ఎండబెట్టాలని, అలాగే పొల్లు లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చూసుకోవాలన్నారు.
చివరిగింజ వరకూ కొనుగోలు చేస్తాం
చివరిగింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కౌడిపల్లి ఏడీఏ బాబూనాయక్ అన్నారు. మండల పరిధిలోని వరిగుంతం, అప్పాజిపల్లి, కొల్చారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం పరిశీలించి, అక్కడి ఐకేపీ ఇన్చార్జిలు, సొ సైటీ సీఈవోలతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు సం బంధించిన ఇబ్బందులు, పాటించవలసిన ప్రమాణా లు అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఏఈవో వినీ తభవాని,సొసైటీ చైర్మన్ ప్రభాకర్,రైతులు పాల్గొన్నారు.