మెదక్, మెదక్ మున్సిపాలిటీ, మెదక్ రూరల్, మే 17 : కరోనా సెకండ్ వేవ్ తీవ్రం కావడంతో ప్రభుత్వం కట్టడికి చర్యలు తీసుకున్నది. అందులో భాగంగానే లాక్డౌన్ అమలు చేస్తున్నది. సోమవారం మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో లాక్డౌన్ విజయవంతమైంది. జిల్లా కేంద్రమైన మెదక్లో దుకాణాలు ఉదయం 6నుంచి 10వరకు తెరువడంతో జనంతో రద్దీగా మారుతున్నాయి. పది గంటల వరకు ప్రజల పను లు ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. నియోజకవర్గంలోని రేగోడ్, పెద్దశంకరంపేట, టేక్మాల్, పాపన్నపేట, హవేళిఘనపూర్, మెదక్, చిన్నశంకరంపేట మండలాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. 10 గంటల తర్వాత దుకాణాదారులు స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. అతర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తే పోలీసులు జరిమానా విధిస్తున్నారు.