రామాయంపేట, మే 14ః ఝాన్సీలింగాపూర్లో లాక్డౌన్ను నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు దుకాణాలకు సర్పంచ్, సిబ్బంది జరిమానా విధించారు. రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీలింగాపూర్లోఅఖిల జువెల్లరి షాపునకు చెందిన ముత్యాల మురళికి రూ.2వేలు, మిగతా మూడు కిరాణ దుకాణాలు శ్రీనివాస్రెడ్డి, ఎర్ర నర్సింహులుకు మరో వ్యక్తికి చెరో రూ 500 చొప్పున జరిమానా వేసినట్లు గ్రామ సర్పంచ్ జ్యోతి, ఉప సర్పంచ్ సుధాకర్రెడ్డి విలేకరులకు తెలిపారు. గ్రామంలో ఎవరైనా లాక్డౌన్ విధించిన రోజుల్లో ఇలాగే వ్యవహరిస్తే వారి లైసెన్సు రద్దుతో పాటు దుకాణాలను నడుపకుండా చేస్తామని హెచ్చరించారు.
కరోనా ఆంక్షలు కఠినంగా ఉన్నాయి
కరోనా ఆంక్షలు కఠినంగా ఉంటాయని, ఎవరు అనవసరంగా మాస్క్లు లేనిదే బయటకు రాద్దని రామాయంపేట ఎస్సై రాజేశ్ హెచ్చరించారు.శుక్రవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో తెరిచి ఉంచిన దుకాణాలను మూసివేసి సిద్దిపేట రోడ్డులో పికెటింగ్ నిర్వహించి వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు.
మూడో రోజు లాక్డౌన్
తూప్రాన్ రూరల్, మే 14: లాక్డౌన్లో భాగంగా తూప్రాన్ పట్టణంలోని వర్తక, వ్యాపార,వాణిజ్య సంస్థలు,కూరగాయల మార్కెట్లు ఉదయం 10 గంటల్లోపే మూసివేశారు. పట్టణ ప్రధాన రహదారితో పాటు పలు కాలనీలు నిర్మానుష్యంగా మా రాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను తూప్రాన్ ఎస్సైలు సత్యనారాయణ, యాదవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు.
నర్సాపూర్…
నర్సాపూర్,మే14: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నర్సాపూర్ పట్టణంలో మూడో రోజూ సంపూర్ణంగా జరిగింది. రోడ్లపై వాహనాలు, ప్రజలు తిరుగ కుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
కొల్చారం..
కొల్చారం, మే 14ః లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. రంగంపేటలో శుక్రవారం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
వెల్దుర్తి..
వెల్దుర్తి, మే 14. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్డౌన్ ఉమ్మడి వెల్దుర్తి మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి 10 గంటల లోపే తమ ఇండ్లకు చేరుకుంటున్నారు. పది గంటలకు దుకాణాలను మూసివేయడం, ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.