అల్లాదుర్గం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అల్లాదు ర్గం మండలంలోని ముప్పారంలో ఏర్పాటు చేసిన అంబేద్క ర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆవిష్కరించారు. అనంతరం ముప్పారం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, గ్రామంలోని లింక్ రోడ్ల నిర్మాణాలకు కృషి చేస్తానని తెలిపారు.
మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో…
మెదక్, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మ న్ మల్లికార్జున్గౌడ్, కౌన్సిలర్లు జయరాజ్, వసంత్రాజ్, శ్రీనివాస్, కిశోర్, టీఆర్ఎస్వీ కో ఆర్డినేటర్ జీవన్రావు, టీఆర్ఎస్ నాయకులు జగపతి, దుర్గప్రసాద్, సయ్యద్ సాదిక్, ము జీబ్, ఉమర్, కృష్ణ, కాసపురం కిరణ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్టీయూ భవన్లో..
అంబేద్కర్ జయంతి సందర్భంగా మెదక్లోని ఎస్టీయూ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్గోపాల్గౌడ్, నాయకులు సిద్ధిరాములు, దేవదాస్, పాల్గొన్నారు.
పోస్టాఫీస్ వద్ద …
మెదక్లోని హెడ్ పోస్టాఫీస్ వద్ద అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
సీపీఎం ఆధ్వర్యంలో…
అంబేద్కర్ జయంతి సందర్భంగా మెదక్ రాందాస్ చౌ రస్తాలో అంబేద్కర్ విగ్రహానికి, కేవల్ కిషన్ భవన్లో ఆయన చిత్రపటానికి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ స భ్యులు నర్సమ్మ, సంతోశ్, గీత పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో…
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ వైస్ చైర్మన్ అశోక్, కౌన్సిలర్లు జయరాజ్, వసంత్రాజ్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు జీవన్రావు, సాధిక్, పాల్గొన్నారు.
టీఎన్జీవో భవన్ …
టీఎన్జీవోస్ భవన్లో జిల్లా అధ్యక్షుడు నరేందర్ ఆధ్యర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు సుధాకర్, సాధిక్, ఫణిరాజ్, మనోహర్, శివాజీ, రాము, రాధ, శ్రీనివాస్ పాల్గొన్నారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు సత్యనారాయణరెడ్డి, కృష్ణ ఆంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
హవేళిఘనపూర్…
హవేళిఘనపూర్, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంతో పాటు మండల పరిధిలోని బూర్గుపల్లి గ్రామంలో హవేళిఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్నాగౌడ్, ఎంపీటీసీ అర్చ న, మాజీ సర్పంచ్ సూర్యం, శ్రీనివాస్, అంబేద్కర్ యువజ న సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రేగోడ్..
రేగోడ్, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి సందర్భంగా రేగోడ్ తహసీల్దార్, పంచాయతీ కార్యాలయం, పోలీస్స్టేషన్, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్.ఇటిక్యాల, ప్యారా రం, టి.లింగంపల్లి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు.
పాపన్నపేట …
పాపన్నపేట,14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాపన్నపేట ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ ఆధ్వర్యంలో పాపన్నపేటలో నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గురుమూర్తిగౌడ్ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్ , బీజేపీ మండల అధ్యక్షుడు రాములు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట …
చిన్నశంకరంపేట,14ఏప్రిల్: మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు.