మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 13 : వృద్ధ్దాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు పొడిగించింది. 57ఏండ్లు నిండిన వారు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించింది. అక్టోబర్ 31 నాటికి 57 ఏండ్లు నిండి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వృద్ధాప్య పింఛన్కు 57ఏండ్లు నిండిన వారు అర్హులు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుదారుడి పేరిట మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి 5 ఎకరాల్లోపు కలిగి ఉండాలి. ఈ కుటుంబంలో ఇది వరకే పింఛన్ పొందుతుంటే మరొకరిని అనర్హులుగా తేల్చుతారు.