చిలిపిచెడ్,జూన్ 11: నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉం టుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బద్రియ తండా,గంగారం గ్రామానికి చెందిన లబ్ధిదారుల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్లకు ఎమ్మెల్యే అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని బద్రియ తండాకు చెందిన భూలికి రూ. 10, 500, శాంతికి రూ.10వేలు, గంగారానికి చెందిన దుర్గప్రసన్నకు రూ.32 వేల చెక్కులు వచ్చాయి. కార్యక్రమంలో ఆ యా గ్రామాల సర్పంచ్లు బుజ్జమ్మ, మమతబాబు, ఉప సర్పంచ్ సుధీర్రెడ్డి, నాయకులు, పాల్గొన్నారు.
కొల్చారంలో..
కొల్చారం, జూన్ 11:మండల పరిధిలోని నాయిన్జలాల్పూర్ చెందిన నాయిని సోమయ్య, చాకలి నర్సమ్మలు అనా రోగ్యంతో దవాఖానలో చికిత్స పొందారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి సహాయంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు.మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మదన్రెడ్డి నాయిన్జలాల్పూర్కు చెందిన ఆత్మ కమిటీ డైరెక్టర్ రాయన్నకు అందజేశారు.కార్యక్రమంలో కౌడిపల్లి సర్పంచ్ వెంకట్రెడ్డి, రవితేజరెడ్డి పాల్గొన్నారు
బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేత
తూప్రాన్ పట్టణ పరిధిలోని రావెళ్లికి చెందిన షేక్సాబేర్పాషా ఆనారోగ్యంతో బాధపడు తూ నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకున్నారు. సీఎం కేసీఆర్ సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి చొరవతో రూ.60 వేలు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కును శుక్రవారం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ అందజేశారు.ఆయన వెంట కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్, రాజు, భగవాన్రెడ్డి, మామిండ్ల కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు ఐలేశ్, దుర్గారెడ్డి, షాదుల్లా పాల్గొన్నారు..
రామాయంపేటలో..
రామాయంపేట మండలం కాట్రియాలలోని నిరుపేద కుటుంబానికి గ్రామ యువకులు ఆర్థిక సాయం చేశారు. గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు మైలారం శ్రీకాంత్-జ్యోతికి టీఆర్ఎస్వీ మండల శాఖ అధ్యక్షుడు కమ్మరి రమేశ్ రూ.5వేలు, కొత్త ఎలక్షన్రెడ్డి రూ. 5వేలు మొత్తం పదివేలను నగదు అందజేశారు. బాధిత కుటుంబం వర్షంలోనే పూరి గుడిసెలో ఉంటున్నారని,చూసి తమవంతు సాయంగా పదివేలు అందజేశామని వారు తెలిపారు.
కార్యకర్తలకు అండగా పార్టీ
కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్ అన్నారు. వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని శేరీ గ్రామానికి చెందిన రమేశ్ విద్యుత్ షాక్తో మృతిచెందగా, పార్టీ సభ్యత్వం ఉండడంతో రూ. 2 లక్షల బీమా చెక్కును రమేశ్ భార్య కృష్ణవేణికి నాయకులు నరేందర్రెడ్డి, పాండు కలిసి అందజేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెంది న బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
మనోహరాబాద్…
అకస్మాత్తుగా మృతి చెందిన మహేశ్ కుటుంబాన్ని ఆదుకుంటానని జడ్పీటీసీ మహేశ్గుప్తా అన్నారు. శివ్వంపేట మండలం చెన్నాపూర్కు చెందిన మహేశ్ ఇటివలే ఆకస్మికంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ మహేశ్గుప్తా మృతుడి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. ఖర్చుల కోసం రూ. 8వేల ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భారతి, ఉప సర్పంచ్ ప్రభాకర్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.