రామాయంపేట, జూన్ 11: రామాయంపేటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరంలో శుక్రవారం రామాయంపేట సూపర్వైజర్ సునంద 450 మందికి వ్యాక్సిన్ వేశారు. పది రోజుల పాటు నిర్వహించే శిబిరంలో పట్టణవాసులు ప్రతి ఒక్కరూ ఒకరోజు ముందు మున్సిపల్ కార్యాలయంలో ఆన్లైన్ చేసుకుని మరుసటి రోజు ఎంపీడీవో కార్యాలయంలో టీకా వేసుకోవాలన్నారు. శిబిరంలో రామాయంపేట ఎస్సైలు రాజేశ్, రాంచంద్రం, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, పాకాల వెంకటేశ్వర్రావు, రాజు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలల ప్రారంభానికి ముందే వ్యాక్సిన్ ఇవ్వాలి
పాఠశాలల ప్రారంభానికి ముందే జిల్లాలోని అన్ని పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ పూర్తి చేయించాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియెట్ అధ్యక్షుడు బొడ్ల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో వ్యాక్సిన్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు,