తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 11: బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కల సాకారమవుతున్నదని, కోటి 40 లక్షల ఎకరాల మాగానికి సాగునీటిని అందించి పంటపొలాలను సస్యశ్యామలం చేయాలన్న చిరకాల వాంఛ నెరవేరుతున్నదని ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమ్రెడ్డి అన్నారు. కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీవాగులోకి విడుదల చేసిన సాగునీరు ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్లోని చెక్డ్యాంల్లోకి చేరింది. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, టీఆర్ఎస్ తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, గ్రామస్తులతో కలిసి మూలవాగు వద్దకు వెళ్లి పూలవర్షంతో జలాలకు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా పారుతున్న 1600 క్యూసెక్కుల జలాలు హల్దీవాగు, మంజీరా నదిలోకి చేరడం ద్వారా 14,268 ఎకరాల వరిపంటకు సాగునీరందుతుందన్నారు. కాళేశ్వరం జలాలతో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు పుష్కలంగా లభిస్తుందన్నారు. తూప్రాన్ మండలంలోని చెక్డ్యాంలు సోమవారం నాటికి నిండుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వప్న, పీఏసీఎస్ చైర్మన్ మెట్టుబాలకృష్ణారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. కాగా, యావాపూర్ చెక్డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి.
నిండిన చెక్డ్యాంలు..
తూప్రాన్ మండలంలోని చెక్ డ్యాంలు నిండి పొంగిపొర్లుతున్నాయి. యావాపూర్ కిష్టాపూర్, ఇస్లాంపూర్, ఆబోతుపల్లి, వెంకటరత్నాపూర్, నాగులపల్లి, జెండాపల్లి గ్రామాల్లో చెక్డ్యాంలు నిండాయి.
ఇవీ కూడా చదవండి…
జానారెడ్డి.. ప్రజలకు గుర్తుండే పని ఒక్కటైనా చేశావా?
సచిన్ వాజ్కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ అరెస్ట్
బడుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్రలో ఈ రోజు