రామాయంపేట, ఏప్రిల్ 11: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కృషిచేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగా రాం, పూలే సంఘం జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని అన్నారు. ఆదివారం రామాయంపేటలో పూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కన్నపేట గ్రామంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మసాయిపేట మల్లేశం, లద్ద నర్సింహులు, సార్గు శ్రీనివాస్ పాల్గొన్నారు
బజరంగ్దళ్ అధ్వర్యంలో పట్టణంలోని బజరంగ్దళ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంఘటన ప్రధాన కార్యదర్శి పుట్టి మల్లేశం, భానుచందర్, రమేశ్, ప్రసాద్, వెంకటి, సతీశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నర్సాపూర్లో..
నర్సాపూర్ రూరల్, ఏప్రిల్ 11 : మండల కేంద్రంలో పూలే జయంతిని టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రావు మాట్లాడుతూ పూలే మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జ్యోతి, మండల అధ్యక్షుడు గణేశ్, ప్రధాన కార్యదర్శి నాగుల్మీరా, జిల్లా కార్యదర్శులు రవి, రమేశ్, రాజు పాల్గొన్నారు.
నిజాంపేటలో..
నిజాంపేట, ఏప్రిల్ 11: మండల వ్యాప్తంగా ఆదివారం ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. నిజాంపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొమ్మాట బాబు ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశం, గ్రామస్తులు గెరుగంటి బాబు, శ్రీకాంత్, బాల్నర్సయ్య, కొమ్మాట చంద్రయ్య పాల్గొన్నారు.
తూప్రాన్లో…
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 11 : తూప్రాన్లో ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
మండుటెండల్లో నీళ్లు పారించాం..
ఎదురు కాల్పుల్లో మావోయిస్టు హతం
‘సీఎం కేసీఆర్ కల నెరవేరుతున్నది’