మెదక్ మున్సిపాలిటీ, జూలై 11: మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2020 జనవరి 22న పోటీ చేసిన అభ్యర్థులు సెక్షన్ 238, టీపీఆర్ చట్టం 2018 ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లో ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ప్రచార ఖర్చుల వివరాలను ఓటమి చెందిన అభ్యర్థులు లెక్క చూపకుండా నిర్లక్ష్యం చేయడంతో ఎన్నికల సంఘం 24 మంది అభ్యర్థులపై మూడు సంవత్సరాల పాటు అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల సం ఘం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 116 మంది పోటీలో ఉండగా, 92 మంది అభ్యర్థులు మాత్రమే ఎన్నికల వ్యయాన్ని సమర్పించారు. మిగతా 24 మంది అభ్యర్థులు(ఓటమి చెందిన) ఎన్నికల వ్యయాన్ని సమర్పించలేదు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం వీరు మూడేండ్ల పాటు పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. 1 వార్డు చల్లా భూపతి యాదవ్ , 3వార్డు బోయిని పోచయ్య, 4వార్డు కూరేల్లి దివ్య,4 వార్డు బోజరాజు శకుంతల ,5 వార్డు వారాల శ్రీకాంత్, 8 వార్డు పాండల సాయమ్మ, 9వారు గడ్డం పద్మ ,9 వార్డు నజీమా తహసీన్,10 వార్డు నేనావత్ దేవిసింగ్ నాయక్, 11వార్డు వనపర్తి రోహిత్కుమార్,11 వార్డు అబ్దుల్ జావేద్ మహమ్మద్, 12వార్డు మహమ్మద్ ఆసీఫ్, 14వార్డు కోరె పద్మ , 15 వార్డు మహమ్మద్ షాబొద్దీన్, 16 వార్డు ఎర్ల నిఖిల్ ,19వార్డు మమత ఆనంద్కుమార్, 21వార్డు మడూరి జ్యోతి, 23వార్డు ధర్మాకర్ లింగాజీ, 24వార్డు మందాపురం లక్ష్మి ్డ,27 వార్డు బొందుగుల సరోజ, 27వార్డు దానోళ్ల శిరీష , 27వార్డు శెట్టిపల్లి ప్రమీల, 29వార్డు నపర్తి పల్లవి ,31వార్డు ఆకుల రాములు
24 మంది అభ్యర్థులు అనర్హులు
ఎన్నికల నియమావళి ప్రకా రం ఎన్నికల జరిగిన 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చులు సమర్పించాలి. మెదక్ మున్సిపాలిటీల్లో 24 మంది అభ్యర్థులు ఎన్నికల ఖర్చు లు సమర్పించలేదు. ఈ మేరకు ఎన్నికల సంఘం వారిని అనర్హులు ప్రకటించారు. రాబోయే మూడేండ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
-శ్రీహరి, మెదక్ మున్సిపల్ కమిషనర్