రామాయంపేట, మే 10 : ప్రజలు కరోనా బారినపడకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నదని రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి అన్నారు. సోమవారం మండలంలోని కోనాపూర్లో సర్పంచ్ చంద్రకళ, వైద్యసిబ్బందితో కలిసి సర్వే చేపట్టారు. గ్రామంలో 19 మంది జ్వరపీడితులుగా నమోదు చేసుకుని, వారందరికీ మందులు పంపిణీ చేశారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, ఆయా సం, దగ్గు తదితర లక్షణాలుంటే వెంటనే సంబంధిత ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు సమాచారం ఇవ్వా లని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చంద్ర హాస్, నాయకులు ఇమ్మానియేల్, విద్యాసాగర్ ఉన్నారు.రామాయంపేట మున్సిపల్తోపాటు గ్రామాల్లో ఇంటింటా సర్వే కొనసాగుతున్నది. పట్టణంలోని బీసీ కాలనీ, సుభాష్నగర్ కాలనీ, సీతయ్యగుడి, రాంనగర్, రెడ్డికాలనీతోపాటు మండలంలోని ఝాన్సీలింగాపూర్, అక్కన్నపేట, తొనిగండ్ల తదితర గ్రామాల్లో సర్వే సాగుతున్నది. ఆయా కార్యక్రమాల్లో కవిత, శ్యామల, రాణి, జ్యోతి, పద్మ, ఏఎన్ఎంలు అనురాధ, బాలలక్ష్మి, మనోజ్, నర్సింహులు పాల్గొన్నారు.
మల్కాపూర్లో ఇంటింటి సర్వే
ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇం టింటి సర్వేకు ప్రజలు సహకరించాలని మల్కాపూర్ సర్పంచ్ మహాదేవి సూచించారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సంఘాల సభ్యులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ దగ్గు, జ్వరం, గొంతు, తలనొప్పి తదితర లక్షణాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. సుమారు 30 మందికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, వారికి మందులు అందజేశారు. సర్వేలో కార్యదర్శి మహేందర్రెడ్డి, వార్డు సభ్యులు పంజాల ఆంజనేయులుగౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బాలానగర్లో సర్వేపూర్తి..
కరోనా నియంత్రణకు ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని బాలానగర్ సర్పంచ్ వికాస్ అన్నారు బాలానగర్లో ఇంటింటి సర్వేను వైద్యసిబ్బంది పూర్తి చేశారు. కాగా, జ్వరం, జలుబు , గొంతు నొప్పి, ఇతర లక్షణాలు ఉన్న26 మందిని గుర్తించి పంచాయతీ కార్యాలయంలో ఉచితంగా మందులను అందజేశారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ హోంఐసొలేషన్లో ఉండాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమం లో కార్యదర్శి మల్లేశం, ఆశ వర్కర్ ఏసుమణి ఉన్నారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బంది..
మండలకేంద్రం చేగుంటతోపాటు గ్రా మాల్లో అంగన్వాడీ, అరోగ్య సిబ్బంది సర్వే నిర్వహించారు. అనార్యోగంతో బాధపడుతున్నవారికి మందులు అందజేస్తు న్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. కార్యక్రమంలో పీఆర్ ఈవో రాణి, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఇంటింటికీ తిరుగుతూ మందుల పంపిణీ
మండలంలోని టి.లింగంపల్లిలో సర్పంచ్ సుమంత ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరోనా వ్యాప్తి, జ్వరం వివరాలు సేకరించి మందులను అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి రాములు, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
తూప్రాన్లో కొవిడ్ కిట్లు అందజేత
పట్టణంతోపాటు గ్రామాల్లో నాలుగు రోజులుగా వైద్య, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో 300 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని తూ ప్రాన్ పీహెచ్సీ డాక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు బాధి తులకు కొవిడ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ బాధితులు ఆందోళన చెందొద్దన్నారు. తాము సూచించిన ప్రకారం మందులను వాడాలన్నారు. సర్వే లో వైద్య సిబ్బంది రేణుక, దుర్గారెడ్డి, ఏఎన్ఎంలు ఉన్నారు.