రామాయంపేట, మే 9 :
‘బీమాతో తమకు ఎంతో ఊరట కల్పించిండు సీఎం కేసీఆర్ సార్. ఎలాంటి ప్రమాదం జరిగినా తమ కుటుంబానికి ఆసరాగా బీమా పాలసీని కట్టి రూ.4లక్షల పత్రాలను అందించండం కలలో కూడా ఊహించలేము’ అని పారిశుధ్య కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, పాలకవర్గం సభ్యులు పట్టణంలో పనిచేస్తున్న 64 మంది మున్సిపల్ కార్మికులకు ఇన్సూరెన్సు పాలసీని కట్టి బీమా పత్రాలను అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడారు. పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు ధీమా ఉండాలనే మున్సిపల్ నుంచి వారికి ప్రమాద బీమాను కట్టి పత్రాలను అందజేమని చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ తెలిపారు. వారి శ్రమ వృథా కాకుండా ఉండాలనే రూ.4లక్షల బీమాను చేసి పత్రాలను అందజేశామని వారు తెలిపారు.
దేవుడిలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్
కరోనా కాలంలో పట్టణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్నాం. మా కష్టాన్ని చూసే సీఎం కేసీఆర్, మా చైర్మన్ జితేందర్గౌడ్ ఇన్సూరెన్సును కల్పించారు. వారికి జీవితకాలం మా కుటుం బం అంతా రుణపడి ఉంటది.
బొట్ల కవిత, కార్మికురాలు