జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే
తూప్రాన్ రూరల్, మే 9 : కరోనాను నియంత్రించడం మన చేతుల్లోనే ఉందని 11వ వార్డు కౌన్సిలర్ అరుణావెంకట్గౌడ్ అన్నారు. పట్టణ పరిధిలోని పడాల్పల్లిలో ఆదివారం వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్తో కలిసి ఆమె ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వేకు ప్రజ లు సహకరించాలన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని సూచించారు. తీవ్రమైన జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు, అలసట లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వైద్యసిబ్బందికి సమాచా రం ఇస్తే, వారు ఉచితంగా మందులు అందజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో మెప్మా సీఏ స్రవంతి, అంగన్వాడీ టీచర్ కాంతమ్మ, ఆశవర్కర్ సునీత, వీఆర్ఏ భాస్కర్ పాల్గొన్నారు.
ఉచితంగా మందులు అందజేత..
రామాయంపేట, మే 9 : పట్టణంతోపాటు మండలంలోని తొనిగండ్ల, అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్, కాట్రియాల, కోనాపూర్ తదితర గ్రామాల్లో ఇంటింటి సర్వే కొనసాగుతున్నది. మండలంలోని గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ లు, గ్రామస్థాయి ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి, ఆరోగ్య వివరాలు సేకరించారు. జ్వరం, దగ్గు, ఆయా సం తదితర వ్యాధులు ఉన్నవారికి మందులు అందజేశారు.
సర్వే నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది
హవేళిఘనపూర్, మే 9 : ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించాలన్న ఆదేశాలతో సర్దన పీహెచ్సీ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, అంగన్వాటీ టీచర్తో కలిసి వాడి గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వరం, జలుబు తదితర ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యామిరెడ్డి, సర్దన హెల్త్ సూపర్వైజర్ మదన్లాల్, ఆర్ఐ మహేశ్ పాల్గొన్నారు.