రాజ్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి
మెదక్రూరల్ ,మే 8 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం మెదక్ మండలంలోని రాజ్పల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బంధు పడుతుందా?, ఏమైనా సమస్యలు ఉన్నాయా?, వడ్లు ఎన్ని రోజులు ఎండబెడుతున్నారు? తదితరు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని రైతు కల్లాల్లో ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. రైతులకు నష్టం కలుగకుండా ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఇప్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మెదక్ వైస్ ఎంపీపీ ఆంజనేయులు, సర్పంచ్ ప్రేమలత, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్రెడ్డి, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ రవికుమార్, అధికారులు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కిష్టయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్ , టీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.