మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించిన మంత్రి
మెదక్ మున్సిపాలిటీ, మే 8 :జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో రూ. 1.70 కోట్లతో నిర్మించిన మార్కెటింగ్ దుకాణ సముదాయన్ని శనివారం ఆర్థిక మంత్రి హరీశ్రావు ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మెదక్ పట్టణంతో పాటు మెదక్, హవేళి ఘనపూర్ మండలాలకు చెందిన వారికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్కుమార్, ఇప్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఆర్డీవో సాయిరాం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రియాజ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్రెడ్డి, తహసీల్దార్ రవికుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, శ్రీనివాస్, కిశోర్, జయరాజ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు లింగారెడ్డి, కిషన్, బోద్దుల కృష్ణ, దుర్గప్రసాద్, హవేళి ఘనపూర్ వైస్ ఎంపీపీ రాధాకృష్ణ, ఆయా గ్రామాల సర్పంచ్లు దేవాగౌడ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కరోనా వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి
కరోనా వ్యాక్సిన్ మొదటి విడుత తీసుకున్న వారు రెండో విడుత వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి హరీశ్రావు సూచించారు. శనివారం మెదక్ మార్కెట్ కమిటీలో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన అనంతరం మహిళల వద్దకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ మొదటి విడుత ఎంత మంది తీసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. మొదటి విడుత తీసుకున్న వారు చేతులేత్తాలని సూచించడంతో కొంత మంది మాత్రమే చేతులెత్తారు. మొదటి విడుత తీసుకున్న వారు రెండో విడుత వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు తీసుకోని వారు సైతం తప్పకుండా టీకా తీసుకోవాలన్నారు.