అమీన్పూర్, జూలై 5 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నెవరం భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పటేల్గూడలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నెవరం భూపాల్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్ పరిధిలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భూపాల్రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాన్నారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధే లక్ష్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని ప్రవేశపెట్టారని తెలిపారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కోరారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రజలు భారీగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, గ్రామ సర్పంచ్ నితీషాశ్రీకాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, నాయకుడు జ్ఞానేశ్వర్, శ్రీకాంత్, సర్పంచ్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్చెరు ఆకుపచ్చగా మారాలి..
మండలం ఐలాపూర్, దాయర గ్రామాల్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పటాన్చెరు నియోజకవర్గం ఆకుపచ్చగా మారాలంటే ప్రజలు అందరూ పెద్దఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలను సంరక్షించాలని కోరారు. పల్లె ప్రగతిలో గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, సర్పంచ్లు మల్లేశ్, భాస్కర్గౌడ్ పంచాయతీ పాలకవర్గసభ్యులు పాల్గొన్నారు.