నిజాంపేట, జూలై 5 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ కావాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో మండలానికి చెందిన 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం చల్మెడ గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమంలో పా ల్గొని పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి ఆర్థిక అభివృద్ధి చెందాలన్నా రు. హరిత తెలంగాణయే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను పంపిణీ చేస్తున్నదని, ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్ద నాటాలన్నారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, జడ్పీటీసీ పంజా విజయ్కుమార్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సం పత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యు డు గౌస్, తహసీల్దార్ జైరాములు, డీఎల్పీవో సుధాకర్రెడ్డి ఎంపీవో రాజేందర్, పంచాయతీ రాజ్ ఏఈ మధు, మిషన్ భగీరథ భిక్షపతి, నిజాంపేట సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అమరసేనారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, మాజీ చైర్మన్ కిష్టారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు రవి, లక్ష్మీనర్సింహులు, మహేశ్, రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికే పల్లెప్రగతి
గ్రామాల అభివృద్ధియే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని ఖాజాపూర్, ఖాజాపూర్ గిరిజన తండా, శాలిపేట, వెంకట్రావ్పల్లి, చెన్నాయపల్లి, మడూర్, సంగాయిపల్లి, గవ్వలపల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం మొక్కలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ మాధవి, తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఎంపీడీవో గణేశ్రెడ్డి, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.