మనోహరాబాద్, జూలై 4 : పల్లెల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని, పల్లె ప్రగతితో గ్రామాన్ని ఆదర్శంగా మార్చుకుందామని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, చిలుముల ఎమ్మెల్యే మదన్రెడ్డిలు అన్నారు. శివ్వంపేటలో గ్రంథాలయం, అంగన్వాడీ భవనం, మినీపార్కును ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ఉండడం మన అదృష్టమని అన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి మాట్లాడు తూ సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ నెలనెలా నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ గ్రామాలను సీఎం కేసీఆర్ తయారు చేసి చూపుతున్నారన్నారు.
హరితహారం అంటే శివ్వంపేట నుంచి నేర్చుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. లక్ష్యాన్ని మించి మొక్కలను నాటడంతో శివ్వంపేట ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రతి మండలంలో గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా జిల్లాలోనే మొట్టమొదటిసారిగా శివ్వంపేటలో డిజిటల్ కంప్యూటర్ సిస్టం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. శివ్వంపేటలో మిగిలిన పనులను రూ. కోటితో పూర్తి చేస్తామన్నారు. 100 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు 30 విద్యుత్ స్తంభాలను ఇవ్వాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ పబ్బా మహేశ్గుప్తా, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూజ, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్, నాయకులు రమణాగౌడ్, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.