చిలిపిచెడ్, జూన్ 4: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సోమక్కపేట సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శీలాంపల్లి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. మం డలంలో ఈ సొసైటీ ద్వారా యాసంగిలో మూడు లక్షల పది వేల బస్తాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రాల నుంచి 95 శాతం కొనుగోలు చేసినట్లు , రైతులు ఇబ్బందులు పడకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి, సొసైటీ వైస్ చైర్మన్ రాంచంద్రరెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ గంగాధర్, నాయకుడు మాణిక్యరెడ్డి ఉన్నారు.
చేగుంటలో..
చేగుంట జూన్ 4: ప్రభుత్వం రైతుల వద్ద కొ నుగోలు చేసిన ధాన్యంను మార్కెట్ కమిటీకి తరలించాలని చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్కుమార్ అన్నారు. చేగుంట మండల పరిధిలోని వడియారం కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను మార్కెట్ కమిటీ గోదాముకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో నిల్వఉన్న ధాన్యం తడిసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకులు నర్సింహులు,బక్కి రమే శ్, భాగ్యరాజ్, చిన్నశివునూర్ సర్పంచ్ అశోక్ తదితరులున్నారు.
రైతులు అందోళన చెందవద్దు
నిజాంపేట, జూన్4: రైతులు ధాన్యం పట్ల ఎటువంటి అందోళన చెందవద్దని, చివరి గింజ వర కు కొనుగోలు చేస్తామని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని నందగోకుల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడూ ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలించడానికి లారీలను అధికారులతో మా ట్లాడి ఏర్పాటు చేశామన్నారు. కార్యక్ర మంలో ఐకేపీ సీఏ మంగమ్మ, గ్రామస్తులు రవి, సంతోశ్గౌడ్, మల్లేశం ఉన్నారు.
తడిసిన ధాన్యం ్ర కొనుగోలు చేస్తాం
మెదక్ రూరల్ ,జూన్ 4: యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పీఏసీఎస్ చైర్మన్ సీతరామయ్య అన్నారు. మాచవరంలో పీఏసీఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ రెండు రోజుల నుంచి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు.