రామాయంపేట, మే 4:మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పా టు చేశామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. మంగళవారం రామాయంపేట మండలం డీ.ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించి విలేకరులతో మాట్లాడారు.జిల్లాలోని మెదక్తో పాటు తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానలో ప్రతిరోజు వ్యాక్సినేషన్, కరోనా టెస్టులను చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు లక్షా 6138 మందికి కరోనా వ్యాక్సిన్ వేశామని , ప్రభుత్వం కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లను ఇస్తుందన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ నమోదు చేసుకోని వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. 18సంవత్సరాలు దాటిన వారికి త్వరలో వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. కార్యక్రమంలో డీ.ధర్మారం వైద్యురాలు ఎలిజబెత్రాణి, రవీందర్, సత్తమ్మ, సూపర్వైజర్ సునం ద, రాజు ఉన్నారు.
లక్ష్మాపూర్లో
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మండంలోని లక్ష్మాపూర్ సర్పంచ్ భాగ్యమ్మ ఏఎన్ఎం, ఆశవర్కర్లు , పారిశుధ్య కార్మికులతో వాడవాడకు రసాయనాలను పిచికారీ చేయిస్తున్నది. గ్రామస్తులకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నది. గ్రామంలో కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. లక్ష్మాపూర్లో లాక్డౌన్ విధించామని ప్రజలు బయటకు రావద్దని సర్పంచ్ తెలిపారు.