రెండు రోజుల్లో 20వేల పరీక్షలు చేయాలి
గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించాలి
కలెక్టరేట్, కమిషనరేట్ భవనాలను ప్రారంభానికి సిద్ధం చేయండి
సమీక్షలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 3 : లాక్డౌన్తో కరో నా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, కొవిడ్ మహమ్మారి కట్టడికి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నదని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. కొవిడ్ నియంత్రణపై గురువారం సిద్దిపేట కలెక్టరేట్లో అధికారులతో ఆయ న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజులుగా కరోనా కేసులుగా బాగా తగ్గాయన్నారు. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలన్నారు. కోహెడ, రామక్కపేట, నానర్పూర పీహెచ్సీల్లో ప్రత్యేక బృందాలతో కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించారు. రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 20 వేల ఆర్టీఏటీ పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా టెస్టులు చేయాలన్నారు.
ప్రారంభానికి సిద్ధం చేయండి..
దుద్దెడ సమీపంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, కమిషనరేట్ కార్యాలయాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో వీటిని నిర్మించామని, ఆయా కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, డీఆర్వో చెన్నయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.