మెదక్: ప్రజాసమస్యల పరిష్కారంపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మీకోసం నేను ఉ న్నాను కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. సమస్యలు సత్వరమే పరిష్కా రం అవుతుండడంతో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు విన్నవించుకుంటున్నారు. శుక్రవారం మెదక్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమం విజయవంతమైంది. గుడ్ ప్రైడే సెలువు రోజు అయినప్పటికీ పాపన్నపేట , మెదక్ , రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, హవేళిఘనపూర్ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే కు విన్నవించుకోవడంతో అక్కడే ఉన్న అధికారులతో సమస్యలు వివరించి పరిష్కరించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో సాయిరాం, పంచాయతీరాజ్ , వ్యవసాయ ,మెదక్ మున్సిపల్ అదికారులు పాల్గొన్నారు.
చెక్కుల అందచేత….
నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 36 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.17 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. మెదక్ పట్టణానికి చెందిన ఉప్పు లక్ష్మి రూ.12 వేలు, మండలానికి చెందిన తిమ్మనగర్ గ్రామానికి చెందిన రవి రూ.60 వేలు, చిట్యాల గ్రామానికి చెందిన కాస వెంకట్రాములుకు రూ.28వేలు , మంబోజిపల్లికి చెందిన భూదమ్మకు రూ. 48 వేలు , రామాయంపేట మండల పరిధిలోని అక్కన్నపేటకు చెందిన రాగి స్వప్నకు రూ.30 వేలు , రాయిలాపూర్ కు చెందిన శ్యామలకు రూ. 24,500 చెక్కులకు అందజేశారు. నిజాంపేటకు చెందిన చెల్మేడకు చెందిన పోచయ్యకు రూ.25 వేలు , పాపన్నపేట మండలానికి చెందిన నామాపూర్కు చెందిన బాలమ్మకు రూ.20 వేలు , కవిత రూ.25 వేలు , పాపన్నపేటకు చెందిన వెంకటేశంకు రూ.12 వేలు , చిన్నశంకరంపేటకు మండలంలోని మల్లుపల్లికి చెందిన సుశీలకు రూ.18 వేలు చెక్కును అందజేశారు.
బీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే….
హవేళిఘనపూర్ మండల పరిధిలోని జక్కన్నపేటకు చెందిన యశోద గత ఎడాది ఆగస్టు 8వ తేదీన ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది . కొర్రబోయిన యశోద 2019-20 పార్టీ సభ్యత్వం పొంది ఉన్నారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందడంతో మృతురాలు భర్త రాజయ్యకు రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగధర్ , కార్యదర్శి కృష్ణగౌడ్, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు , టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
ఫ్యూచర్-రిలయన్స్ డీల్: లీగల్గా అమెజాన్ నిలుస్తుందా?!
అప్పుల ఊబిలో కుటుంబాలు.. తగ్గిన సేవింగ్స్!
డెడ్లైన్ మార్చి 31.. జాగ్రత్త
ఉద్యోగం మారినా పీఎఫ్ నంబర్ ఒకటే
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !