మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 1: ప్రమాదవశాత్తు అడవుల్లో మంటలు వ్యాపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అడవుల్లో ఈ మధ్యకాలంలో 19వేల వరకు అగ్ని ప్రమాదాలు చో టు చేసుకున్నాయన్నారు. అగ్నిప్రమాదాలు జరుగకుం డా పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని రోడ్డుపక్కన బీడీ, సిగరెట్లు పడేసినా, అటవీ ప్రాంతాల్లోని చెట్ల కింద వంటలు చేసుకొని చల్లార్చకుండా అలాగే విడిచి వెళ్లినా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయన్నారు. ప్రమాదా లు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతాల దగ్గర ఉన్న గ్రామాల్లో చాటింపు, బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల వల్ల చిన్న చిన్న కీటకాలు, పక్షులు, పాములు వంటి జీవాలకు నష్టం జరుగుతుందన్నారు. కొందరు వేటగాళ్లు జంతువుల కోసం నిప్పుతో పొగ పెడుతుంటారని దీనివల్ల మంటలు వ్యాపిస్తాయన్నారు. జిల్లాలో 57వేల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉందని, ఇందులో పిల్లిట్ల రిజర్వు ఫారెస్ట్, ఏడుపాయల, తొనిగండ్ల, వల్లూరు, మంగళపర్తి రిజర్వు ఫారెస్ట్ల్లో చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు సంభవించాయన్నారు.
ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీమ్లు
అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి రేంజ్కు 6 నుం చి 7మంది సభ్యులు ఉన్న ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
టోల్ ఫ్రీ నెంబర్….
అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే సమాచారం అందించడానికి టోల్ ఫ్రీ నెంబర్ 18004255264 లేదా 1926కు ఫోన్ చేయాలని డీఎఫ్వో సూచించారు.
ఇవీ కూడా చదవండీ..
జమ్మూలో టీటీడీ ఆలయానికి భూకేటాయింపు..
నందిగ్రామ్లో హింస.. సువేందు కాన్వాయ్పై రాళ్ల దాడి