చిలిపిచెడ్, ఏప్రిల్ 1: వైకుంఠధామాల నిర్మాణాలు ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని మం డల ప్రత్యేక అధికారి దేవయ్య అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి దేవయ్య ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం మండల బ్లాక్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ అధ్యక్షుడు ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి,సభ్యులుగా ఎంపీటీసీలు, సర్పంచులను ఎన్నిక చేశారు.అనంతరం దేవయ్య మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురికి కాల్వలు, పాఠశాలలకు సంబంధించిన పనులను ఎంపీటీసీలతో కలిసి సర్పంచులు పని చేసుకోవచ్చన్నారు. గ్రామాల్లో నిర్మింస్తున్న వైకుంఠధామాలకు నిధులు విడుదల అయ్యాయని తెలిపారు.పూర్తి కాని గ్రామాల్లో వైకుంఠధామాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో 34 వేల కరోనా టీకాలు సిద్ధంగా ఉన్నాయని సమావేశంలో చిలిపిచెడ్ జడ్పీటీసీ శేషసాయిరెడ్డి తెలిపారు.మండలంలోని ప్రజలు,నాయకులు ఈ టీకాలు తీసుకోవాలని జడ్పీటీసీ కోరారు. మండలంలోని ప్రజలు టీకాలు తీసుకుంటామని ముం దకు వస్తే కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి అందజేస్తామన్నారు.ఈ సమావేశంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి,వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి,మండల కో-ఆప్షన్ సభ్యుడు షఫి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాశ్రెడ్డి, ఎంపీడీవో శశిప్రభ, ఎంపీవో పోలేశ్వర్ రాజు,ఏపీవో శ్యామ్కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
వైకుంఠధామాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఎంపీడీవో వెంకటలక్ష్మి అన్నారు. గురువారం ఆమె తహసీల్దార్ జైరాములుతో కలసి నందిగామ, చల్మెడ, నిజాంపేట, జెడ్చెరువు తండా, బచ్చురాజ్పల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఏప్రిల్ 15 కల్లా వైకుంఠధామాలు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులకు,స్థానిక ప్రజాప్రతినిధులకు ఎంపీడీవో సూచించారు.కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ఇవీ కూడా చదవండీ..
టీకా తీసుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి