మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్య సంవత్సరానికిగాను మెదక్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మంగళవారం నాటికి 407 ప్రవేశాలు దాటయని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్ విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా ప్రవేశాలు జరిగి జిల్లాలోనే కళాశాల ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
ఇంటర్ ప్రవేశాలకు ప్రభుత్వం ఈనెల 30 వరకు గడువు పెంచినందున ఇంకా ప్రవేశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, అడ్మిషన్ ఫీజులు మాఫీ లాంటి ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెరిగాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్, నేషనల్ గ్రీన్ కాప్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ వంటి సేవా కార్యక్రమా లు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు టీషాట్, డీడీ యాదగిరిలో ఆన్లైన్ తరగతులతో పాటు అధ్యాపకు లు
ప్రతిరోజు జూమ్ యాప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారరంభిస్తే కొవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ కళాశాలను నడిపిస్తామన్నారు. ఈ సందర్బంగా కళాశా లలో ప్రవేశాలు పొందిన పలువురు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు.