కొల్చారం: సింగూరు నుంచి నీటి విడుదలతో వనదుర్గ ప్రాజెక్టు ఆదివారం పొంగి ప్రవహిస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వనదుర్గా ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా దర్శనమిస్తున్నది. పోతంశెట్పల్లి చౌరస్తా నుంచి ఏడుపాయల వెళ్లే బ్రిడ్జిల కింది నుంచి నీరు నిండుగా ప్రవహిస్తుండటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వరదను చూసి పరవశించిపోతున్నారు.